రీసెంట్గా ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో సక్సెస్ కొట్టిన యంగ్ హీరో నాని ఇప్పుడు రెండు సినిమాలను చేతిలో పెట్టుకుని ఉన్నాడు.అందులో హనురాఘవపూడి సినిమా ‘జై బాలయ్య’(అనుకుంటున్నారు) విడుదలకు సన్నాహాలు చేసుకుంటుంది.
దీని తర్వాత ఇంద్రగంటి మోహన్కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్టయిపోయాయి.
గతంలో వీరి కాంబినేషన్లో విడుదలైన కామెడి అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అష్టాచమ్మా’ మంచి సక్సెస్ను సాధించింది.ఇప్పుడు రెండోసారి వీరి కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఉంటాయనే సంగతి తెలిసిందే.
ఇంద్రగంటి మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడట.ఇప్పటి వరకు నాని చేయని జోనర్ మూవీ కాబట్టి చాలా ఆసక్తిగా ఉన్నాడట.
అలాగే సినిమాలో ఎమోషనల్ లవ్ ట్రాక్ కూడా రన్ అవుతుందట.సురభి, నివేదిత థామస్ హీరోయిన్లుగా నటించనున్నారు.
సినిమా డిసెంబ్ చివరి నుండి సెట్స్లోకి వెళుతుందని టాక్.