తెలుగు సినీ నటుడు మెగా బ్రదర్ నాగబాబు గురించి అందరికి తెలిసిందే.ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన.
కొన్ని సినిమాలలో అతిథి పాత్రల్లో కూడా మెప్పించారు.ఆయన నటనకు మంచి గుర్తింపు అందుకున్నారు.
అంతే కాకుండా ముక్కుసూటి మనిషిగా, అవతలి వారితో కాస్త హాస్యంతో కూడిన వెటకారంతో కూడా మాట్లాడుతుంటారు.ఇక సోషల్ మీడియాలో నాగబాబు ఎంత బిజీ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ద్వారా నాగబాబు ప్రేక్షకులకు మరింత ఎక్కువగా దగ్గరయ్యారు.జబర్దస్త్ షోలో నాగబాబు జడ్జీ గా చేసిన సంగతి తెలిసిందే.కానీ అనుకోకుండా కొన్ని విమర్శల వల్ల జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాడు.ఆ తర్వాత జీ తెలుగులో అదిరింది షో తో జబర్దస్త్ ను మించేలా కామెడీ షో ను అందించారు.
కానీ అది అనుకున్నంత గుర్తింపు ఇవ్వలేదు.ఇక సోషల్ మీడియాలో మాత్రం నాగబాబు మరింత ఎక్కువగా పోస్టులతో బిజీ గా మారాడు.
తన వ్యక్తిగత విషయాల గురించి, కుటుంబం గురించి అభిమానులతో పంచుకుంటుంటారు.
ఇక నాగబాబు సోషల్ మీడియా పెట్టే పోస్టుల్లో కొన్ని వివాదాలు కూడా ఎదురవుతుంటాయి.అంతేకాకుండా ఆయన పెట్టే కామెంట్స్ కూడా అవతల వారిని కించపరిచేలా ఉంటాయి.ఇక ఆయన చేసిన కామెంట్స్ లతో మీమ్స్ కూడా బాగానే వచ్చాయి.
ఇదిలా ఉంటే తాజాగా నాగబాబు మిమర్స్ గురించి కొన్ని విషయాలు తెలిపాడు.వారికి సరైన గుర్తింపు రావడం లేదంటూ, వారి విలువను చాలామంది గుర్తించలేకపోతున్నారని తెలిపాడు.
ఇక ఇండస్ట్రీలో వీరిని ఎక్కువగా గుర్తించరని, కేవలం వారి మీమ్స్ ఆర్థికంగా సహాయపడుతుందని అన్నారు.ఇదిలా ఉంటే నాగబాబును ఓ మీమర్ కొన్ని ప్రశ్నలు వేయగ.వెంటనే స్పందించారు.మీరు ఎప్పుడైనా ఏదైనా పాత్రను రిజెక్ట్ చేసి బాధపడ్డరా అని అడగగా.
తను ఒక పాత్ర రిజెక్ట్ చేసేంత సీన్ లేదని తల వరకు వచ్చిన పాత్రల్ని చేస్తానంటూ తెలిపాడు.కానీ ఓసారి తన వద్దకు వచ్చిన ఓ పాత్రను చేయలేకపోయానని అది సముద్రం సినిమాలో శ్రీహరి పాత్ర అని చెప్పుకొచ్చాడు.
ఆ సినిమా కోసం డైరెక్టర్ కృష్ణ వంశీ గారు తనని అడుగగా ఆ సమయంలో నాగబాబు ఫారన్ లో ఉన్నందున చేయలేకపోయానని తెలిపాడు.