తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకపుడు స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో ఎన్టీఆర్, ఏన్నాఆర్, కృష్ణ శోభన్ బాబు, కృష్ణంరాజు లు ప్రముఖులు వీళ్ల తర్వాత మంచి హీరో గా పేరు తెచ్చుకున్న వాళ్ళల్లో మురళి మోహన్ ఒకరు మురళి మోహన్ చాలా సినిమాల్లో హీరో గా కనిపించాడు.ఆయన హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చాలా సినిమాలు చేసారు.
అటు సినిమాలు చేస్తూనే పాలిటిక్స్ లో కూడా బిజీ గా ఉండేవారు అదే క్రమం లో ఆయన జయ బేరి ఆర్ట్స్ అనే ఒక ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టి కొన్ని సినిమాలు తీశారు.అందులో ముఖ్యమైన సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరో గా వచ్చిన అతడు అనే సినిమా.
మురళి మోహన్ కృష్ణ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల
ఇండస్ట్రీ లో కూడా వీళ్లిద్దరు మంచి సన్నిహితంగా ఉండేవారు అయితే కృష్ణ కొడుకు అయినా మహేష్ తో ఒక సినిమా చేయాలనీ చాలా రోజులు వెయిట్ చేసాడు మురళి మోహన్…ఈ క్రమం లోనే త్రివిక్రమ్ చెప్పిన కథ కృష్ణ గారికి, మహేష్ కి నచ్చడంతో ఈ ప్రాజక్టు కి ప్రొడ్యూసర్ గా మురళి మోహన్ గారిని తీసుకుందాం అని కృష్ణ రిఫర్ చేయడం తో ఈ సినిమా కి మురళి మోహన్ ప్రొడ్యూసర్ గా మారాడు కానీ ఈ సినిమా 6 నెలల్లో పూర్తి చేస్తాను అని చెప్పిన త్రివిక్రమ్ సంవత్సరం పాటు తీస్తూనే ఉన్నాడు.ఒకే సీన్ ని రెండు మూడు సార్లు తీయడం
ఒక్క రోజులో అయిపోయే ఒక చిన్న సీన్ ని కూడా ఒక 10,15 రోజులు తీయడం తో మురళి మోహన్ గారు విసిగి పోయారు…మొత్తనికి సంవత్స్రం తర్వాత సినిమా పూర్తి అయి రిలీజ్ అయింది.కానీ సినిమా యావరేజ్ గా ఆడింది దింతో మురళి మోహన్ గారు చాలా డబ్బులు నష్టపోయారు…అయితే ఫస్ట్ చెప్పినట్లు గా 6 నెలల్లో తీసి ఉంటె కనీసం టేబుల్ ఫ్రాఫిట్ అయినా వచ్చి ఉండేది అని అనుకున్నారు ఇక ఆ దెబ్బ తో ఈ కాలం దర్శకులకి సినిమాలు తీయడం రాదు.
అసలు వాళ్ళకి ఏం కావాలో క్లారిటీ ఉండదు ఊరికే అలా తీస్తూ ఉంటారు.అదే మా కాలం లో అయితే మానిటర్స్ లేకుండానే సినిమాలు తీసే వాళ్ళం, ఎక్కడ రీల్ వేస్ట్ అయిపోతుందో అని ముందే అంత ప్రిపేర్ అయి ఒక షాట్ తీసేవాళ్ళం ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ కి అంత విజన్ లేదు అందుకే నేను ఇక సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఆపేసాను అని ఆయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు…అతడు సినిమా థియేటర్ లో యావరేజ్ అయినప్పటికీ టీవీ ల్లో మాత్రం మంచి హిట్ సినిమా అనే చెప్పాలి ఇప్పటికి ఆ సినిమా టీవీ లో వస్తే చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు…
.