ప్రముఖ నటుడు శ్రీహరి కొన్నేళ్ల క్రితం ఆరోగ్య సంబంధిత సమస్యల వల్ల మృతి చెందిన సంగతి తెలిసిందే.నటుడు మేకా రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఇప్పటికీ చదువుతున్నానని ఎంఫిల్ కోర్సులో తాజాగా జాయిన్ అయ్యానని వెల్లడించారు.
సీనియర్ ఎన్టీఆర్ తెలుగు యూనివర్సిటీని ఏ సంకల్పంతో పెట్టారో తెలియదని తెలుగు యూనివర్సిటీ ఒక కళా నిలయమని మేకా రామకృష్ణ అన్నారు.
కళాకారులకు, ఔత్సాహికులకు తెలుగు యూనివర్సిటీ పుణ్య స్థలమని మేకా రామకృష్ణ చెప్పుకొచ్చారు.
అక్కడ చదివిన వాళ్లు ఎంతోమంది బయట ప్రదర్శనలు ఇస్తూ ఉన్నత స్థానాలకు ఎదిగారని మేకా రామకృష్ణ కామెంట్లు చేశారు.అక్కడ నుంచి వచ్చినవాళ్లలో 500 మంది ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నారని మిగిలిన వాళ్లు మాత్రం డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్నారని మేకా రామకృష్ణ వెల్లడించారు.
ఒక ఆర్టిస్టుకు నాటకమా, సినిమానా అనే విషయంలో తేడా ఉండదని రెండిటికి చాలా తేడా ఉంటుందని మేకా రామకృష్ణ అన్నారు.
నటులకు నాటక రంగంలో మాత్రమే సంతృప్తి కలుగుతుందని మేకా రామకృష్ణ చెప్పుకొచ్చారు.నాటకాలలో స్క్రిప్ట్ ను మనకు అనుకూలంగా రాసుకోవడం సాధ్యమవుతుందని మేకా రామకృష్ణ వెల్లడించారు.సినిమాలలో లిమిటేషన్స్ ఉంటాయని సీరియళ్లలో కూడా ఇదే పరిస్థితి అని రామకృష్ణ అన్నారు.
1987 నుంచి శ్రీహరితో క్లోజ్ గా ఉన్నానని సినిమాల్లో సక్సెస్ కావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారని రామకృష్ణ చెప్పుకొచ్చారు.శ్రీహరి అందరితో కలిసిపోతారని డేర్ నెస్ ఎక్కువ అని రామకృష్ణ అన్నారు.పాన్ పరాఖ్ ఆయన బాగా నములుతారని అదే ఆయన ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపించి ఉండవచ్చని మేకా రామకృష్ణ వెల్లడించారు.శ్రీహరి భుజంపై చెయ్యి చేసి స్నేహపూర్వకంగా మాట్లాడేవారని రామకృష్ణ చెప్పుకొచ్చారు.
రామకృష్ణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.