ఇటీవల కాలంలో టాలీవుడ్ సూపర్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించినటువంటి “సరిలేరు నీకెవ్వరు” అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో నల్లమల అడవిలో మహేష్ బాబు చేసేటువంటి ఫైట్ సన్నివేశం ఎంతగా హైలైట్ అయ్యిందో చెప్పనవసరం లేదు.
అయితే ఇందులో విలన్ పాత్రలో నటించిన టువంటి కుమనన్ చెప్పే రమణ లోడ్ ఎత్తాలిరా అనే డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది.దీంతో పలువురు నెటిజన్లు ఈ డైలాగ్ ని బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే ఈ సన్నివేశంలో నటించినటువంటి కుమనన్ తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తన జీవితంలోని పలు ఆసక్తికర అంశాలు గురించి ప్రేక్షకులతో పెంచుకున్నాడు.
అయితే ఇందులో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీని పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ పార్టీ పెట్టిన సమయంలో చిరంజీవికి సంబంధించినటువంటి సెక్యూరిటీ బాధ్యతలను టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ నిర్మాతకి అప్పగించారు.
అయితే ఆ నిర్మాత నటుడు కుమనన్ కి మంచి స్నేహితుడు.దాంతో కుమనన్ ని చిరంజీవి సెక్యూరిటీ భాద్యతలు కూడా చేపట్టాడట.ఆ విధంగా చిరంజీవికి అప్పట్లోనే కుమనన్ సెక్యూరిటీ గార్డుగా పని చేశానని చెప్పుకొచ్చాడు.అయితే తాను చేసినటువంటి సేవలను గుర్తించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకి సెల్యూట్ చేశాడని కూడా చెప్పుకొచ్చాడు.
అంతేగాక తనకు మెగాస్టార్ చిరంజీవి అన్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా ఎంతో అమితమైన అభిమానమని తెలిపాడు.
అయితే ఈ విషయాన్ని ఇలా ఉండగా కుమనన్ ప్రస్తుతం “అసలు ఏం జరిగిందంటే” అనే చిత్రంలో ప్రాధాన్యత కలిగినటువంటి మాంత్రికుడి పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ కూడా విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది.అయితే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో తన డైలాగులతో ఆకట్టుకున్న టువంటి ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో అవకాశాలు బాగానే అందిపుచ్చుకున్నాడు.