టాలీవుడ్ లో నటుడు కృష్ణుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు సినిమాలలో హీరోగా అందరిని అలరించిన నటుడుగా గుర్తింపు తెచ్చుకొని ఉన్నాడు.
ఆ సినిమా తర్వాత కూడా కృష్ణుడు హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.
ఇక క్యారేక్తర్ట్ ఆర్టిస్ట్ గా కూడా తన కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేసిన కృష్ణుడుకి నటుడుగా మంచి పేరు ఉంది.అయితే గత ఎన్నికలకి ముందు వైసీపీ పార్టీలో చేరి ఆ పార్టీకి స్టార్ క్యంపైనర్ గా కూడా ప్రచారం చేశాడు.
తరువాత పూర్తిగా కనిపించకుండా పోయిన కృష్ణుడు మరల నిర్మాతగా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. తన కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్ అనే ఓ నిర్మాణ సంస్థను స్థాపించారాయన.
లోతుగడ్డ జయరామ్ అనే యంగ్ టాలెంట్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కృష్ణుడు మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా నిర్మించాడు.ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
అయితే కరోనా పరిస్థితుల కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది.తాజాగా ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అఫీషియల్ గా ప్రకటించింది.
ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ నేటితరం యువత భావాలకు అద్దం పట్టేలా మా చిత్రం ఉంటుంది.ఫైనల్ అవుట్పుట్ చూశాక సంతృప్తిగా అనిపించింది.
తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదించారు.ఇప్పుడు నిర్మాతగా నా ప్రయాణాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని ఆవిష్కరించినట్లు దర్శకుడు తెలిపాడు.మరి నటుడుగా సక్సెస్ అయిన కృష్ణుడుకి నిర్మాతగా ఈ సినిమా ఏ మేరకు విజయం అందిస్తుంది అనేది చూడాలి.