ఇప్పటికే బుల్లితెరపై పలు రకాల కామెడీ షోలు ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, అదిరింది, కామెడీ స్టార్స్ ఇలా బుల్లితెరపై పలురకాల కామెడీ షో లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈ టీవీలో సరి కొత్తగా మరొక కామెడీ ఎంటర్టైనర్ షో రాబోతోంది.ఆ షో పేరు జాతి రత్నాలు.
ఇక ఈ షో కి యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించబోతుంది .త్వరలోనే ప్రారంభం కానున్న ఈ షోకి సంబంధించిన మొదటి ప్రోమో ని విడుదల చేశారు.ఈ జాతి రత్నాలు కామెడీ షో ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ఈటీవీ ప్లస్ లో ప్రసారం కానుంది.
ఇక తాజాగా వదిలిన ప్రోమో లో ఇంద్రజ,పోసాని, భద్రం, అన్నపూర్ణమ్మ, కృష్ణ భగవాన్ పలువురు కనిపించారు.
అయితే ఈ ప్రోమో లో చాలా కాలం తరువాత నటుడు కృష్ణ భగవాన్ కనిపించారు.కృష్ణభగవాన్ ఒక్కసారిగా కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.చాలా కాలం తర్వాత మళ్లీ బుల్లితెర ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఎంతో సంతోషపడ్డారు.కృష్ణభగవాన్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ కమెడియన్ గా దూసుకు పోయిన విషయం తెలిసిందే.
ఎక్కువగా వంశీ తెరకెక్కించే సినిమాలో కృష్ణభగవాన్ తప్పకుండా కనిపిస్తూ ఉంటారు.
అలా టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.అల్లరి నరేష్, కృష్ణ భగవాన్ లు కలసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.అయితే ఈ మధ్యకాలంలో కృష్ణభగవాన్ సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు.
చాలా కాలం పాటు కృష్ణభగవాన్ సినిమాలకు దూరంగా ఉన్నారు.చాలా ఏళ్ల తర్వాత కృష్ణభగవాన్ మళ్లీ బుల్లితెర ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక బుల్లితెర ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన కృష్ణభగవాన్ అభిమానులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి మరి.