ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మళ్లీ దూసుకొస్తోంది.ఇప్పటికే ఈ వైరస్ నుంచి ఎన్నో ప్రాణ నష్టాలు జరుగగా ప్రస్తుతం వ్యాప్తి చెందిన ఈ వైరస్ మరిన్ని లక్షణాలతో చాలా వేగంగా వ్యాపిస్తుంది.
అంతేకాకుండా పలుచోట్ల వైరస్ సోకగా రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి.ఇదిలా ఉంటే తాజాగా ఓ బాలీవుడ్ హీరోకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.
గత ఏడాది నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందగా కొన్ని లాక్ డౌన్ ల తర్వాత తిరిగి ప్రతి ఒక్క రంగాలు తెర్చుకున్న సంగతి తెలిసిందే.ఇక తాజాగా బాలీవుడ్ యువ హీర కార్తీక్ ఆర్యన్ కరోనా బారిన పడ్డాడు.
ఈ విషయాన్ని ఆయనే ప్లస్ సింబల్ తో ఉన్న ఫోటోతో సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.ఇక త్వరగా కోలుకునేలా ప్రార్థించాలని కోరాడు కార్తీక్.ఈ విషయాన్ని స్పందించిన నెటిజనులు తప్పకుండా కోలుకుంటారని, భయపడకండి అంటూ ఇచ్చారు.
ఇదిలా ఉంటే కార్తీక్ కు కరోనా వైరస్ సోకడంతో మరో బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెగ టెన్షన్ పడిపోతుంది.ఎందుకంటే ఇటీవలే ఆదివారం జరిగిన ల్యాక్మీ ఫ్యాషన్ వీక్ లో కియారా అద్వానీ, డిజైనర్ మనీష్ మల్హోత్రా, కార్తీక్ ర్యాంప్ వాక్ లో పాల్గొన్నారు.అంతేకాకుండా కియారా టబులతో కలసి భూల్ భులైయా 2 అనే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంది.
దీంతో వీళ్ళందరికీ కరోనా భయం పట్టుకుంది.ఇక ఇక గత కొన్ని రోజులుగా తను కాంటాక్ట్ అయిన వారిలో లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కార్తీక్ కోరాడు.
ఇక ఆయన చివరిగా ఇంతియాజ్ అలీ లవ్ ఆజ్ కల్ లో కనిపించారు.