సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన వారు, అలాగే నాలుగైదు సినిమాలతో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్న హీరోయిన్లు ఆ తర్వాత కాలంలో సినిమా ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఆ విధంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
అందం అభినయం అని ఉన్నప్పటికీ అవకాశాలు వికాసము మా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇంకొందరు మాత్రం వ్యక్తిగత కారణాలవల్ల సినిమాలకు దూరం అవ్వాల్సి వచ్చింది.
ఈ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు మొదటి సినిమాతోనే భారీగా గుర్తింపుని ఏర్పరచుకొని
ఆ తర్వాత అవకాశాలు లేక ఒకటి రెండు సినిమాలలో నటించి ఇండస్ట్రీకి దూరమైన వారు చాలామంది ఉన్నారు అని చెప్పవచ్చు.అటువంటి వారిలో హీరోయిన్ గౌరీ పండిట్ కూడా ఒకరు.చాలామంది గౌరీ పండిట్ అంటే గుర్తుపెట్టుకోవచ్చు కానీ గోపీచంద్ హీరోగా నటించిన ఆంధ్రుడు సినిమా హీరోయిన్ ఉంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తాను.2005లో పరుచూరి మురళీకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రుడు సినిమాతో తొలిసారిగా పరిచయం అయింది గౌరీ పండిట్.
అప్పట్లోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను ను అందుకొని అటు గోపీచంద్ కు, ఇటు గౌరీ పండిట్ కు భారీగా గుర్తిపును తెచ్చిపెట్టింది.ఈ సినిమాతో ప్రేక్షకులందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.అది ఆంధ్రుడు సినిమా తర్వాత గౌరీ పలు సినిమాలో నటించినప్పటికీ ఆమెకు అవి ఆశించిన విధంగా వారికి సక్సెస్ ను తెచ్చి పెట్టలేకపోయాయి.తెలుగుతోపాటు, హిందీలోనూ కొన్ని సినిమాల్లో నటించింది.ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరమైంది.2011లో బాలీవుడ్ నటుడు నిఖిల్ ద్వివేదిని వివాహం చేసుకుంది.
కాగా వీరికి ఓ బాబు ఉన్నారు.అయితే గౌరీ సినిమాలలో నటించక పోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటుంది.ఈ క్రమంలోనే తాజాగా గౌరీ ఆమె భర్త కొడుకు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఆంధ్రుడు సినిమాలో ఉన్న గౌరీని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోలో ఉన్నది చూసి ఇద్దరు ఒకటేనా అన్న అనుమానాలు వస్తున్నాయి.
అంతలా గౌరీ పండిట్ మారిపోయింది.