కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, భార్య ఐశ్వర్య అభిమానులకు ఒక షాక్ ఇచ్చారు.18 ఏళ్ల వారి వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు.అర్ధరాత్రి ఈ విషయము సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే అన్ని ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట ఎందుకు విడాకులు తీసుకున్నారు.విడాకులు తీసుకోవడానికి కారణం ఏమిటి? విడాకుల ప్రకటనకు ముందు ఏం జరిగింది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఐశ్వర్య కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు అన్న విషయం అందరికి తెలిసిందే.
ఇక వీరి పెళ్లి నాటికి ఐశ్వర్య వయసు 23 ఏళ్లు కాగా, ధనుష్ వయసు 21 ఏళ్లు మాత్రమే.
ఇక అప్పటికే ఐశ్వర్య ధనుష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇక వారి దాంపత్య విషయంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని సున్నితంగానే పరిష్కరించుకుంటూ ముందుకు సాగారు.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
ఇక వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.మధ్యమధ్యలో సమస్యలు ఎదురైనప్పుడు వాటికీ రజినీకాంత్ సమక్షంలో పరిష్కారాలు జరిగేవి.
ఇక విడాకుల ప్రకటనకు 15 రోజుల ముందు ఈ దంపతులు వారి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు.ఈ క్రమంలోనే పార్టీలో ధనుష్ భార్య కోసం ప్రత్యేకంగా రొమాంటిక్ పాట కూడా పాడారు.
కానీ అర్ధరాత్రి సమయంలో ఐశ్వర్య ధనుష్ విడిపోతున్నట్లు గా ప్రకటన ఇవ్వడంతో ధనుష్ అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వారిద్దరూ కూడా వ్యక్తిగత ఇష్టంతోనే విడిపోతున్నట్లు గా సోషల్ మీడియాలో పేర్కొన్నారు.అయితే ఈ విషయంలో అభిమానుల నుంచి అలాగే మీడియా నుంచి కూడా ప్రైవసీ కావాలని కోరారు.
ఈ విషయంపై రజినీకాంత్ స్పందిస్తూ వారి వ్యక్తిగత నిర్ణయానికి ఒప్పుకోక తప్ప లేదని తెలుస్తోంది మరి ఈ విషయంపై రజినీకాంత్ బహిరంగంగా క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.