బాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్ మాఫియా ఓ కుదుపు కుదిపింది.ఈ క్రమంలోనే ఎన్సీబీ అధికారులు మెరుపు దాడులు చేస్తూ పలువురిపై అనుమానాలను వ్యక్తపరుస్తూ కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.
ఈ క్రమంలోనే మరి కొందరి సెలబ్రిటీలను అధికారులు విచారిస్తూ.అసలు విషయాలను కూపీ లాగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ డ్రగ్ మాఫియా కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీల మెడకు చుట్టుకుందని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల క్రితం వరకు పలువురు సినీ సెలబ్రెటీలను అధికారులు ఈ విషయం గురించి విచారణ చేపట్టి పలు కీలకమైన విషయాలను రాబట్టారు.
ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించినటువంటి బ్లాక్ బస్టర్ చిత్రం సింగం సినిమాలో ఈ విధమైనటువంటి డ్రగ్ మాఫియా సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో చెక్ వుమె మాల్విన్ అనే నైజీరియన్ అక్రమంగా డ్రగ్స్ సప్లై చేసే ముఠాకు సంబంధించిన వాడిగా చూపించారు.
అయితే ఇతను రీల్ లైఫ్లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా డ్రగ్స్ సప్లై చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.ఇతని నుంచి అధికారులు ఏకంగా 15 గ్రాముల ఎండీఎంఏ,7 లక్షల విలువైన 250 ml హాష్ ఆయిల్, మొబైల్ ఫోన్లు, 2,500 నగదు, ఇంకా 8 లక్షల విలువైన డ్రగ్స్ ను అతని నుంచి పోలీసులు స్వాధీనం చేసుకొని వాటిని సీజ్ చేశారు.ఈ క్రమంలోనే పోలీసులు కేసును దర్యాప్తు చేసుకొని అతని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ డ్రగ్స్ ఎక్కడినుంచి ఎక్కడికి సరఫరా అవుతున్నాయి వీటి ప్రధాన సూత్రధారి ఎవరు అనే విషయాల గురించి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.మొత్తానికి ఈ నటుడు నిజజీవితంలో కూడా సింగం సినిమాని చూపించారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.