తెలుగులో ప్రస్తుతం నూతన దర్శకుడు సందీప్ రాజ్ “కలర్ ఫోటో” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోగా పలు టాలీవుడ్ చిత్రాలలో కమెడియన్ మరియు హీరో స్నేహితుడి పాత్రలో ఎంతగానో అలరించిన “సుహాస్” నటిస్తున్నాడు.
అలాగే హీరోయిన్ గా గా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి నటిస్తోంది.కాగా ఈ చిత్రంలో వైవా హర్ష, సునీల్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
అయితే తాజాగా ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇటీవలే ఈ చిత్ర యూనిట్ సభ్యులు టీజర్ ని విడుదల చేశారు.దీంతో ఈ చిత్ర టీజర్ చూసినటువంటి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు అనూహ్య రీతిలో స్పందిస్తున్నారు.
ఇందులో భాగంగా టాలీవుడ్ సీనియర్ నటుడు మరియు సపోర్టింగ్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు. ఇందులో భాగంగా ఈ నటుడికి చాలా టాలెంట్ ఉందని అందుకే తొక్కేయాలని లేకపోతే చాలా డేంజర్ అంటూ సరదాగా తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.
మరోవైపు ఈ టీజర్ పై టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా స్పందించి టీజర్ చాలా బాగుందని, ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.అలాగే చిత్ర యూనిట్ సభ్యుల పని తీరును కూడా ప్రశంసించాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తి కావాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా కొంత కాలం పాటు ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులను వాయిదా వేశారు.దాంతో ఈ చిత్రం విడుదల విషయంలో కూడా కొంతమేర ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.