గతేడాది బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సినిమాలలో పుష్ప ది రైజ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.బన్నీ అద్భుతమైన నటన, సుకుమార్ డైరెక్షన్ పుష్ప ది రైజ్ సంచలన విజయం సాధించడానికి కారణమయ్యాయని చెప్పవచ్చు.
సమంత స్పెషల్ సాంగ్ కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.అయితే సీనియర్ నటులలో ఒకరైన భానుచందర్ సమంత సాంగ్ వల్లే పుష్ప సినిమా హిట్ అయిందని పరోక్షంగా చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన భానుచందర్ బాలీవుడ్ ను టాలీవుడ్ ఓవర్ చేయడం నిజమేనని వెల్లడించారు.ఈ మధ్య కాలంలో వచ్చిన సౌత్ సినిమాలలో చాలా సినిమాలు హిట్ అయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు.
పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్టైందో చూశామని ఊ అంటావా సాంగ్ వల్లే ఆ సినిమా సక్సెస్ సాధించిందని భానుచందర్ చెప్పుకొచ్చారు.సమంత చేసిన ఆ సాంగ్ తమిళ, మలయాళ భాషల్లో కూడా మారుమ్రోగుతోందని భానుచందర్ కామెంట్లు చేశారు.
ఏ స్థాయి వ్యక్తులు అయినా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తే మంచిదని భానుచందర్ చెప్పుకొచ్చారు.
మనకు ఎంత పేరుప్రతిష్టలు ఉన్నా అవి మనల్ని కాపాడలేవని ఆయన వెల్లడించారు.ఎంత డబ్బు సంపాదించినా హెల్త్ ను జాగ్రత్తగా ఉంచుకోవడం కూడా ముఖ్యమేనని ఆయన కామెంట్లు చేశారు.భానుచందర్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పుష్ప ది రైజ్ సక్సెస్ తో సమంత రేంజ్ కూడా పెరిగిందనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సమంతకు ఇతర భాషల నుంచి కూడా భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.సమంత తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సమంత డిమాండ్ కు అనుగుణంగా ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.