జనాలను చీటింగ్ చేసిన కేసులో ఓ తెలుగు హీరోను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.టాలీవుడ్ జనాలను అవాక్కయ్యేలా చేసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
‘ఎవడ్రా హీరో’ అనే సినిమాలో హీరోగా నటించిన రహీం బషీద్(46) గతకొంత కాలంగా బ్యాంకు రుణాలు ఇప్పిస్తానంటూ పలువురు నుండి డబ్బులు వసూళు చేశాడు.
దుబాయ్లో వ్యాపారం చేస్తున్నట్లు అందరినీ నమ్మించాడు.
అది నకిలీ వ్యాపారం అని తేలడంతో దుబాయ్ ఎంబసీ బషీద్పై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో హైదరాబాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.బాధితులు ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలు వసూలు చేశాడు బషీద్.ఎస్బీకే గ్రూప్ పేరుతో ఆయన చేసిన నకిలీ వ్యాపారం బట్టబయలు కావడంతో దుబాయ్ ఎంబసీ అతడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఆదేశం ఇవ్వడంతో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా ప్రస్తుతం ఈ ఘటన తెలుగు ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది.
హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన ఆ హీరో ఎవరా అని ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు.అతడు చేసిన మోసం ఏమిటి, ఎందుకు అతడు అలా చేయాల్సి వచ్చిందని వారందరు ప్రశ్నిస్తున్నారు.
ఏదేమైనా ఈ ఘటన తాజాగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.