కరోనా లాక్ డౌన్ కష్టాలు, భయం నుంచి బయటపడి ఇప్పుడే మళ్ళీ ప్రజలందరూ వారి వారి ప్రయాణాలలో బిజీ అవుతున్నారు.మళ్ళీ యధావిధిగా పనులు చేసుకుంటున్నారు.
అయితే ఇలాంటి సమయంలో బ్రిటన్ లో కరోనా కొత్త స్టెయిన్ కలకలం మొదలైంది.ఇక ఆ వైరస్ ఇండియాలోకి రాకుండా అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది.
అయినా కాని బ్రిటన్ నుంచి వచ్చిన కొంత మంది ద్వారా ఈ కొత్త స్టెయిన్ ఇండియాలోకి వచ్చేసింది.అయితే ఇప్పుడు ఈ కొత్త స్టెయిన్ వైరస్ మరింత ఎక్కువ ప్రభావం చూపించకుండా నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక తాజాగా బ్రిటన్ నుంచి ఇండియా వచ్చిన బనితా సందుకి కరోనా వచ్చింది.అయితే ఇది కొత్త స్టెయిన్ కరోనానా లేక నార్మల్ కరోనా వైరస్ అనేది తెలియాల్సి ఉంది.
అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ ఆదిత్యా వర్మ సినిమాతో ఆమె సౌత్ ప్రేక్షకులకి చేరువ అయ్యింది.కవితా తెరెసా సినిమా షూటింగ్ కోసం ఆమె బ్రిటన్ వెళ్లి వచ్చింది.
అక్కడి నుంచి వచ్చాక టెస్ట్ లలో ఆమెకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.దీంతో డాక్టర్లు, పోలీసులు ఆమెని హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేశారు.అయితే ఆమె మాత్రం హాస్పిటల్ కి వెళ్లనని మొండికేసింది.ఆమెను బెలియాఘటలో ఏర్పాటు చేసిన ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆసుపత్రికి తరలించాలని అధికారులు నిర్ణయించి, అంబులెన్స్ ఎక్కించారు.తీరా ఆసుపత్రికి వెళ్లిన తరువాత, వాహనం దిగేందుకు నిరాకరించిన బనితా నానాయాగీ చేసింది.అక్కడి నుంచి పారిపోయేందుకు ఆమె ప్రయత్నించింది.
విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు అంబులెన్స్ చుట్టూ కవచంలా నిలిచి ఆమెను నిలువరించారు.ఆపై ఓ ప్రైవేటు ఆసుపత్రికి బనితాను పంపారు.