రాజకీయ నాయకునిగా, నటుడిగా పాపులారిటీని సంపాదించుకున్న సెలబ్రిటీలలో బాబు మోహన్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే.ఖమ్మం జిల్లాలోని బీరోలులో బాబు మోహన్ జన్మించారు.
బాబు మోహన్ తండ్రి టీచర్ కాగా సినిమాలపై ఉండే ఆసక్తితో బాబు మోహన్ ప్రభుత్వ రెవిన్యూ విభాగంలో వచ్చిన ఉద్యోగానికి రాజీనామా చేశారు.ఈ ప్రశ్నకు బదులేది సినిమాతో బాబు మోహన్ నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.
మామగారు సినిమాతో కమెడియన్ గా మంచి పేరును సొంతం చేసుకున్న బాబు మోహన్ కు ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి.తనదైన శైలి కామెడీతో బాబు మోహన్ కమెడియన్ గా మెప్పించారు.
మాయలోడు సినిమా బాబు మోహన్ కు స్టార్ కమెడియన్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది.సీనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన బాబు మోహన్ సీనియర్ ఎన్టీఆర్ పై ఉండే అభిమానంతో టీడీపీలో చేరారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాబు మోహన్ మాట్లాడుతూ కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు.
కనీవిని ఎరుగని, ఊహించని ఆటుపోట్లను తాను ఎదుర్కొన్నానని బాబు మోహన్ కామెంట్లు చేశారు.సూదులు, భల్లాలు గుచ్చుకుంటూ ఉంటాయని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.టీ.
ఆర్.ఎస్ పార్టీలో ఇప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్లంతా టీడీపీ వాళ్లేనని బాబు మోహన్ తెలిపారు.
విజయశాంతికి పొలిటికల్ గా అన్యాయం జరిగిందని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.ఎన్టీ రామారావునే ప్రజలు ఓడించారని బాబు మోహన్ అన్నారు.కేసీఆర్ లైఫ్ లాంగ్ సీఎం కారని బాబు మోహన్ అన్నారు.ప్రస్తుతం బాబు మోహన్ సినిమాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.తన సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో బాబు మోహన్ నటించారు.బాబు మోహన్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.