తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేసిన మంచు విష్ణు భారీ మెజారిటీతో గెలుపొందాడు.
కాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ అధ్యక్ష పదవికి పోటీ చేశాడు.కానీ పలు అనివార్య కారణాల వల్ల ఎన్నికలలో విజయం సాధించలేక పోయాడు.
అయితే ప్రకాష్ రాజు తరపున ఎన్నికలలో పాల్గొన్నటువంటి ప్రముఖ నటుడు మరియు నిర్మాత “నాగబాబు” తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇందులో భాగంగా నటుడు ప్రకాష్ రాజ్ వ్యక్తిత్వం గురించి స్పందిస్తూ ఎన్నికలలో ఓడిపోయినంత మాత్రాన ప్రకాష్ రాజ్ ని తక్కువ అంచనా వేయకూడదని ప్రకాష్ రాజ్ కి రాష్ట్రీయ, జాతీయ రాజకీయాలలో అనుభవం ఉందని అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రకాష్ రాజ్ రాజీనామా చేసాడని అంతే తప్ప ఎలాంటి వేరే ఉద్దేశం లేదని తెలిపాడు.
ఇక మా ఎన్నికలలో మంచు విష్ణు గెలిచిన తీరుపై కూడా స్పందిస్తూ ఘాటు విమర్శలు చేశాడు.
ఇందులో భాగంగా మా ఎన్నికల లీగల్ అడ్వైజర్ ఉన్నటువంటి కృష్ణ మురళి కూడా కొంతమేర మానిప్యులేట్ చేస్తూ ఎన్నికలు నిర్వహించారని వచ్చే ఎన్నికలలో కృష్ణ మురళి లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇక మంచు విష్ణు మరియు అతడి కుటుంబ సభ్యులు ఆర్టిస్టుల ఓట్లను ఆకర్షించేందుకు ఆర్టిస్టుల కుటుంబాలకి చీరలు పంచడం, డబ్బులు పంచడం, సత్కారాలు కూడా చేశారని ఇది సరికాదని తన అభిప్రాయాన్ని తెలిపాడు.
ఒకవేళ మూవీ ఆర్టిస్టులపై తమకు అంత అభిమానం ఉంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత సన్మానాలు, సత్కారాలు చేయాల్సిందని అంతేగాని ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలాంటివి చేయడం ఓటర్లను మభ్యపెట్టడమే అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు.ఏదేమైనప్పటికీ సార్వత్రిక ఎన్నికల తరహాలో జరిగిన మా ఎన్నికలపై తీవ్ర ఆసక్తి నెలకొంది.ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని మంచు విష్ణు లోకల్ అనే విషయాలు కూడా తెరపైకి రావడంతో ప్రాంతీయ తత్వాన్ని సమర్థిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు తమ తీర్పు ఇచ్చారు.