దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ఉధృతం అవుతుంది.రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య గణనీయంగా నమోదవుతున్నాయి.
తాజాగా రికార్డు స్థాయిలో దేశంలో కరోనా కేసులు నమోదు అయ్యాయి.మొదటిసారి కరోనా వ్యాప్తి చెందినప్పుడు కూడా నమోదు కాని స్థాయిలో సెకండ్ వేవ్ లో కేసుల సంఖ్య లక్షని సమీపిస్తున్నాయి.
అదే సమయంలో ప్రజలలో నిర్లక్ష్యం ఎక్కువ కావడం వలెనే కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయని తెలుస్తుంది.ఇదిలా ఉంటే కరోనా వైరస్ ఇప్పుడు సెలబ్రిటీల మీద కూడా ముప్పేట దాడి చేస్తుంది.
ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పది హోం క్వారంటైన్ లో ఉంటున్నారు.షూటింగ్ లలో సెలబ్రిటీలు పాల్గొంటూ ఉండటం వలన వారిని ఎక్కువగా కరోనా తాకుతుంది.
కేవలం బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ చిత్ర పరిశ్రమలో కూడా ఇప్పటికే పలువురు కరోనా బారిన పడ్డారు.తాజాగా వకీల్ సాబ్ సినిమాలో నటించిన నివేదా థామస్ కరోనా బారిన పడి సినిమా ప్రమోషన్ కి దూరమైంది.
ఇదిలా ఉంటే బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు.ఆదివారం వెలువడిన ఫలితాల్లో తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణైందని సోషల్ మీడియా వేదికైన ఇన్స్ట్రాగ్రామ్, ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
నిబంధనలకుగుణంగా తాను ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నానని చెప్పారు.ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.త్వరలోగా కోలుకుని తిరిగి షూటింగ్లలో పాల్గొంటానని పేర్కొన్నారు.ప్రస్తుతం అక్షయ్ కుమార్ రామసేతు సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నడుస్తుంది.అక్షయ్ కుమార్ కరోనా బారిన పడటంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తుంది.