వెండి తెరపై ఎవరెన్ని ఘనతలు చేసినా ఆ ఘనత డైరక్టర్ కే దక్కుతుందన్నారు నటుడు అజయ్.ఈవ్ టీజర్ గా, ఇన్నోసెంట్ లవర్ గా, విలన్ గా 20ఏళ్ల సినీ జీవితం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు.విజయవాడలో పుట్టి.చదువుకోసం హైదరాబాద్ కు వచ్చిన అజయ్.సినిమాపై ఉన్న ప్యాషన్ తో ఫిల్మింస్కూల్ లో జాయిన్ అయ్యారు.ఆ కోర్స్ పూర్తైన సంవత్సరం తరువాత కౌరవుడుతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ నటుడు ఖుషి, సైనికుడు, పోకిరి, సింహాద్రి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో యాక్ట్ చేశారు.
కౌరవుడు తరువాత ఖుషీలో ఈవ్ టీజర్ క్యారక్టర్ దక్కింది.ఆ తరువాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఒక్కడు సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్నారు.
ఆ సినిమాతోనే అగ్రదర్శకుల చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది.
ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాలోని టిట్లా క్యారక్టర్ తో బాగా హైలెట్ అయ్యారు.
ఈ సినిమాలో నెత్తిన పోలీస్ టోపీ.మూతి మీద మీసం ఉందని… దేవుడు…దేవుడు అని భజన చేశారు కదరా.
ఏకీ సీ గోలిసే…అంటూ టిట్లా గా భయపెట్టించాడు అజయ్.మహేష్ బాబు కెరియర్ లో రికార్డ్ లు క్రియేట్ చేసిన ఒక్కడు, అతడు, పోకిరి ఇలా అన్నింటిల్లో నటించారు.
ఇటీవలే అల.వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, భీష్మలో అలరించిన అజయ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అజయ్ ఒక ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.తాను ఎక్కువగా విలన్ క్యారక్టర్లు చేయడం వల్ల.ఇంట్లో పిల్లలు సైతం ఎందుకు డాడీ అలా కొట్టించుకుంటున్నావని అమాయకంగా అడుగుతారని అన్నారు.ఎలా చెప్పాలో అర్ధం కాక బాగా తన్నులు తింటే డబ్బులు బాగొస్తాయని నవ్వుతూ బదులిస్తానని నవ్వులు పూయించాడు నటుడు అజయ్.