మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెరాస నాయకునిపై చర్యలు తీసుకోవాలన్నారు బీజేపీ నాయకులు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో స్థానిక తెరాస నాయకుల ఆగడాలు రోజు రోజుకీ శ్రుతి మించుతున్నాయి.
పట్టణంలోని మంగలి బజార్ వీధిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాట మీద బతుకమ్మ ఆడిన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన 17 వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త నాయిని సతీష్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు పట్టణ బీజేపీ నాయకులు.తెరాస నాయకుడు మహిళలనే గౌరవం లేకుండా వాట్సాప్ గ్రూపుల్లో కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు మండిపడ్డారు.
నియోజకవర్గ ఎమ్మెల్యే కల్పించుకొని క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.తెరాస నాయకుని పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.