సౌత్ ఇండియా సినిమాలలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు అర్జున్.యాక్షన్ కింగ్ అనే బ్రాండ్ ని అర్జున్ తన సినిమాలతో సొంతం చేసుకున్నాడు.
తెలుగు, తమిళ్, కన్నడ బాషలలో సక్సెస్ ఫుల్ హీరోగా అర్జున్ రాణించాడని చెప్పాలి.కెరియర్ ఆరంభంలో కన్నడ, తెలుగు సినిమాలు ఎక్కువ చేసిన అర్జున్ తరువాత కోలీవుడ్ లో జెంటిల్మెన్, ఒకే ఒక్కడు సినిమాల ద్వారా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.
ఈ నేపధ్యంలో యాక్షన్ కింగ్ అర్జున్ కి మూడు బాషలలో ఫ్యాన్స్ ఉన్నారు.అతని సినిమా వచ్చింది అంటే సౌత్ ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిగా చూస్తారు.
అయితే ఈ మధ్యకాలంలో అర్జున్ హీరోగా సినిమాలు తగ్గించేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు.తెలుగులో అర్జున్ చివరిగా నా పేరు సూర్య సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
ఇదిలా ఉంటే అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా కన్నడ ఇండస్ట్రీలో మాస్ హీరోగా తిరుగులేని ఇమేజ్ కలిగి ఉన్నాడు.ఇప్పుడు ధృవ్ సర్జా నటించిన కన్నడ మూవీ పొగరుని అదే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్ కాబోతుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అర్జున్ తన పొలిటికల్ జర్నీ గురించి ఆసక్తికర వాఖ్యలు చేశారు.
తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు, సంతృప్తికరంగా ఉన్నానని అన్నారు.రాజకీయాలు అసలు నాకు చేతకాదు.
నేను వాటికి పనికిరాను.రాజకీయాలు చేసేంత తెలివితేటలు కూడా నాకు లేవు.
ఒకే ఒక్కడు లాంటి స్టొరీలు సినిమాలకి వర్క్ అవుట్ అవుతాయి తప్ప నిజ జీవితంలో సేవా దృక్పథంతో రాజకీయాలు చేయాలని ఎవరూ రారు అంటూ కామెంట్స్ చేశారు.ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.