బాలీవుడ్ బడా హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు.ఈయన విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు.
ఈయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు.జయాపజయాలతో సంభంధం లేకుండా వరస పెట్టి సినిమాలు చేస్తుంటాడు.
కరోనా కారణంగా 2020 లో పెద్దగా సినిమాలు విడుదల చేయలేదు కానీ లేకపోతే సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు.
కరోనా సమయంలో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మి బాంబ్ సినిమా ఓటిటి లో రిలీజ్ అయ్యింది.
ఇది కాంచన సినిమాకు రీమేక్ గా వచ్చింది.ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.
అక్షయ్ కుమార్ నటించిన మరొక సినిమా సూర్య వంశీ.ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.
అయితే ఈ సినిమాను కూడా ఓటిటి లో రిలీజ్ చెయ్యాలని భావించిన ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఏప్రిల్ 30 న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈయన నటించిన బెల్ బాటమ్ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాను మే 28 న విడుదల చేయబోతున్నారు.
తాజాగా అక్షయ్ కుమార్ చేస్తున్న రామ్ సేతు సినిమా అయోధ్యలో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు.
అభిషేక్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పురావస్తు శాస్త్ర వేత్తగా కనిపించబోతున్నారు.
ఈ సినిమా షూటింగ్ 80 శాతం ముంబైలోనే పూర్తి చేయబోతున్నారు.ఈ సినిమాను చంద్రప్రకాష్ ద్వివేది నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లారు.ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.