సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న పుష్ప సినిమా షూటింగ్ కి రంగం సిద్ధమవుతోంది.ఈ సినిమా కథ కంప్లీట్ గా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది.
ఈ నేపధ్యంలో కేరళ, రాజమండ్రి అటవీప్రాంతాలలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు.పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో మాస్ పాత్రలో పుష్ప రాజ్ అనే రోల్ లో కనిపించబోతున్నాడు.
దానికి తగ్గ ఆహార్యంలోకి ఇప్పటికే వచ్చేశాడు.ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని సుకుమార్ టీం అనుకుంటుంది.
అల్లు అర్జున్ కెరియర్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాని అదే స్థాయిలో అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యే విధంగా సుకుమార్ కథని సిద్ధం చేశాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ యాక్షన్ సీక్వెన్స్ రిహార్సల్స్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.
సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ని వీలైనంత సహజంగా ఉండే విధంగా సుకుమార్ డిజైన్ చేసినట్లు సమాచారం.దీనికోసం ముందస్తుగా రిహార్సల్స్ తీసుకుంటే బెటర్ అనే ఆలోచనతో బన్నీ, ఫైటర్లు పాల్గొనే భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్రస్తుతం హైదరాబాదులో నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
ముందుగా హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో సాంగ్ చిత్రీకరించి తరువాత ఫారెస్ట్ లో యాక్షన్ ఎపిసోడ్ తో పూర్తి స్థాయి షూటింగ్ స్టార్ట్ చేసి గ్యాప్ లేకుండా సింగిల్ షెడ్యూల్ లో సినిమాని ముగించాలని సుకుమార్ టీం అనుకుంటుంది.అల్లు అర్జున్ కూడా షూటింగ్ కి వెళ్ళడానికి ముందే తన సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ ని రిహార్సల్ చేసి సెట్స్ పైకి వెళ్తే ఈజీ అవుతుందని భావించి ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన నటిస్తుంది.