కాక్ పిట్ లో ఒక ప్రయాణికురాలు దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అయితే ఈ ఘటన కారణంగా ఆ విమానం పైలట్ పై వేటు పడినట్లు తెలుస్తుంది.
ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ ఘటన కు సంబందించిన వివరాలను తాజాగా ఉన్నతాధికారులు తెలిపారు.గుయిలిన్ నుండి యాంగ్జౌకి వెళ్తోన్న గుయిలిన్ జీటీ1011 విమానంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.
విమానం కాక్పిట్లో మహిళా ప్రయాణికురాలు దిగిన ఫొటో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అది కాస్త వైరల్ గా మారడం తో సంబంధిత పైలట్కు ఫ్లైయింగ్ నిషేధించినట్లు అధికారులు తాజాగా తెలిపారు.
ఫొటోలో మహిళ తన వేళ్ళతో ‘వి’ గుర్తు చూపిస్తూ కాక్పిట్లో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇలా కాక్ పిట్ లో ఉండడం చాలా సంతోషం కలిగించింది అని, కెప్టెన్కు ధన్యవాదాలు తెలుపుతూ కామెంట్ పెట్టింది.అయితే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఇలా ప్రయాణికురాలిని కాక్ పిట్ లోకి అనుమతించడం పై గుర్రు మన్న అధికారులు ఆ పైలట్ పై వేటు వేశారు.చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, ప్రత్యేక అనుమతి లేకుండా లేదా అవసరమైన సమయంలో ప్రయాణీకులను కాక్పిట్లోకి అనుమతించరు.
అలాంటిది ఎలాంటి అనుమతి లేకుండా ఇలా ఒక ప్రయాణికురాల్ని కాక్ పిట్ లోకి రానివ్వడం నిబంధనలను ఉల్లఘించినట్లు అని అధికారులు ఆ పైలట్ తో పాటు ఈ ఘటన సమయంలో విమానంలో ఉన్న ఇతర సిబ్బందిని కూడా శాశ్వతంగా సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది.ఎదో ఒక ప్రయాణికురాలి సరదా తీర్చడం కోసం పైలట్ తన కెరీర్ నే పణంగా పెట్టాల్సి వచ్చినట్లు అయ్యింది.
గతంలో కూడా కొన్ని ఎయిర్ లైన్స్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు కూడా దాదాపు ఉన్నతాధికారులు పైలట్ లపై వేటు వేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.