మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.ఈ సినిమాలోని టెంపుల్ సిటీ సెట్టింగ్ గురించి మీడియాలో భారీ ఎత్తున వార్తలు వస్తున్నాయి.
మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో చిరంజీవి టెంపుల్ సిటీ గురించిన ఒక వీడియోను విడుదల చేశారు.ట్విట్టర్ లో టెంపుల్ సిటీ వీడియో ను షేర్ చేయడంతో అంత వావ్ అంటున్నారు.20 ఎకరాల్లో ఈ టెంపుల్ సిటీ సెట్ వేశారని, ప్రతి చిన్న డీటైల్ ను తీసుకు వచ్చేలా టెంపుల్ సెట్టింగ్ ను తీర్చి దిద్దారు అంటూ చిరంజీవి పేర్కొన్నాడు.ఈ సెట్ ఇండియాలోనే అతి పెద్దదిగా చిరంజీవి చెప్పుకొచ్చారు.
అద్బుతమైన కళా దర్శకుడి పని తీరుకుకి ఇది నిదర్శణం అన్నట్లుగా నిలిచిందన్నారు.ఈ సెట్ ను ఇంత అద్బుతంగా రూపొందించిన సురేష్ ను దర్శకుడు కొరటాల శివను మరియు వనరులు అందించిన నిర్మాతలు నిరంజన్ రెడ్డి మరియు రామ్ చరణ్ లను అభినందిస్తున్నాను అన్నారు.
ఈ సెంట్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగబోతున్నట్లుగా తెలుస్తోంది.20 ఎకరాల్లో టెంపుల్ సిటీ అంటే ఒక అద్బుతం అన్నట్లుగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.టెంపుల్ సిటీ ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కోసం వేయలేదు.మొదటి సారి ఆ అద్బుతంను ఆ విష్కరించినందుకు గాను చిత్ర యూనిట్ సభ్యులను నెటిజన్స్ అభినందిస్తున్నారు.20 కోట్ల రూపాయలతో ఈ సెట్ ను వేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని అది నిజం కాదు.20 ఎకరాల్లో ఈ సెట్ ను వేశారు.కాస్త అటు ఇటుగా రూ.5 కోట్ల వరకు ఈ సెట్ కు ఖర్చు చేసి ఉంటారు అంటున్నారు.సురేష్ ఈ సెట్టింగ్ పూర్తిగా విభిన్నంగా వేయించారు అంటున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ అక్కడే జరుగుతోంది.సెట్ ను చూపించాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి ఈ వీడియోను విడుదల చేశారు.