గతకొద్ది రోజులుగా నైజాం ఏరియలో థియేటర్స్ విషయంలో దిల్ రాజు, వరంగల్ శ్రీను మధ్య ఫైట్ జరుగుతున్న సంగతి తెలిసిందే.క్రాక్ సినిమాని వరంగల్ శ్రీను నైజాంలో రిలీజ్ చేశారు.
మాస్టర్ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేశారు.అయితే మాస్టర్ సినిమా కోసం క్రాక్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని హౌస్ ఫుల్ కలెక్షన్ తో నడుస్తున్న తీసేశారని మీడియా సాక్షిగా విమర్శలు చేశారు.
అయితే ఈ విమర్శలపై దిల్ రాజు ఎలాంటి సమాధానం చెప్పలేదు.ఇప్పుడు పెద్ద సినిమాల రిలీజ్ విషయంలో వరంగల్ శ్రీను దిల్ రాజుకి పోటీ వస్తున్నారు.
నైజాం ఏరియాలో దిల్ రాజు ఆధిపత్యానికి గండి కొట్టాలని ఫిక్స్ అయిన వరంగల్ శ్రీను ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల రిలీజ్ కోసం పోటీ పడుతున్నాడు.ఈ నేపధ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ నైజాం రిలీజ్ విషయంలో ఇద్దరి మధ్య గట్టి పోటీ నడిచింది.
ఫైనల్ గా వరంగల్ శ్రీను ఏకంగా 42 కోట్లకి ఆచార్య నైజాం రిలీజ్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు.ఓ విధంగా ఇది పెద్ద మొత్తమే అయినా దిల్ రాజు పెత్తనానికి గండి కొట్టడానికి వరంగల్ శ్రీను గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడని దీనిని బట్టి అర్ధమవుతుంది.పెద్ద హీరోల సినిమాల విషయంలో థియేటర్స్ పరంగా దిల్ రాజు ఇబ్బంది పెట్టె అవకాశం లేదు.అలా పెట్టాలని చూస్తే మాత్రం మెగా ఫ్యామిలీ నుంచి రాజు గారికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుందని ఆలోచించి వరంగల్ శ్రీను ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.
మెగాస్టార్ ఇమేజ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నైజాం ఏరియానె 42 కోట్లకి అమ్ముడుపోవడంతో రిలీజ్ కి ముందే సినిమా మీద పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందని భావిస్తున్నారు.ఇక ఆచార్య సినిమా రిలీజ్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకోవడం వరంగల్ శ్రీను బడా డిస్టిబ్యూటర్స్ సరసన చేరిపోయాడానే టాక్టాలీవుడ్ లో వినిపిస్తుంది.