టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం కూడా ఒకటి.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తి చేసుకుంది.
అయితే కరోనా, లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందనే సంగతి తెలిసిందే.కాగా ఇటీవల సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభం కావడంతో ఆచార్య షూటింగ్ కూడా తిరిగి ప్రారంభించేందుకు కొరటాల శివ అండ్ కో రెడీ అవుతున్నారు.
అయితే ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కరోనా టెస్ట్ చేయించుకోగా, ఆయనకు పాజిటివ్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవికి కరోనా రావడంతో ఆచార్య యూనిట్ ఒక్కసారిగా అవాక్కయ్యింది.
దీంతో ఆచార్య చిత్ర షూటింగ్ను మరోసారి వాయిదా వేశారు చిత్ర యూనిట్.అయితే ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అనే సందేహం అందరిలో నెలకొంది.
కాగా చిరుకు కరోనా సోకడంతో ఇప్పుడు ఆయన తన ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.దీంతో మరో రెండు నెలల వరకు ఆయన సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.
అయితే మెగాస్టార్కు కరోనా రావడంతో చిత్ర యూనిట్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కాగా ఇప్పటికే అనుకున్న దానికంటే ఆలస్యమవుతున్న ఆచార్య షూటింగ్, ఇప్పుడు మెగాస్టార్కు కరోనా కారణంగా మరింత ఆలస్యం కానుంది.
ఇక మరో రెండు నెలల పాటు ఆచార్య చిత్ర షూటింగ్ పట్టాలెక్కే అవకాశం లేకపోవడంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది.ఈ సినిమా ఎప్పుడు తిరిగి షూటింగ్ ప్రారంభించుకుంటుందో, ఎప్పుడు పూర్తి చేసుకుంటుందో అని వారు ఆలోచనలో పడ్డారు.
అటు హీరోయిన్ కాజల్ కూడా పెళ్లి చేసుకొని హనీమూన్ను ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.