మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాని కూడా కొరటాల తన స్టైల్ లో సామాజిక అంశాలని టచ్ చేస్తూ కమర్షియల్ ఎంటర్టైనర్ గానే తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ సినిమా ఉంది.లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇక చాలా కాలం తర్వాత చిరంజీవి మరోసారి ఈ సినిమా కోసం మణిశర్మతో కలిసి పని చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం చిరంజీవి చాలా కాలం తర్వాత మరోసారి పాట పాడబోతున్నట్లు తెలుస్తుంది.
గతంలో మణిశర్మ మ్యూజిక్ అందిసించిన చూడాలని ఉంది, మాస్టర్ సినిమాలలో చిరంజీవి తన గొంతుతో పాటలు పాడారు.
ఆ పాటలు చాలా ఫేమస్ అయ్యాయి.ఇక మరోసారి ఈ సినిమా కోసం ఓ చిన్న లెరికల్ సాంగ్ ని చిరంజీవితో పాడించాలని మణిశర్మ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ పాటని ఇప్పటికే చంద్రబోస్ తో రాయించడం కూడా జరిగిపోయిందని టాక్ వినిపిస్తుంది.తను పాట పాడితే అది సినిమాకి అదనంగా మార్కెట్ అందించే అవకాశాలు ఉండటంతో చిరంజీవి కూడా ఒకే చెప్పినట్లు సమాచారం.
అయితే ఈ పాట ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చిత్ర యూనిట్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.మరి చిరంజీవి గతంలో పాడిన ఛాయ్ రేంజ్ లో ఈ పాట కూడా క్లిక్ అవుతుందేమో చూడాలి.