మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ చేస్తున్న సినిమాల్లో ‘ఆచార్య’ సినిమా ఒకటి.ఈ సినిమాను డైరెక్టర్ కొరటాల శివ మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.
ఇందులో చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపు కుంటుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, టీజర్, పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి.
ఈ సినిమాను కొరటాల యాక్షన్ ప్యాక్డ్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే తండ్రి, కొడుకు కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా కావడంతో మెగా అభిమానులు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో స్ట్రీమింగ్ హక్కులకు భారీ ధర పలికినట్టు సమాచారం.
ఈ సినిమా ఓటిటి భాగస్వామిగా అమెజాన్ ప్రైమ్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది.అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ ధర చెల్లించి మరి సొంతం చేసుకున్నట్టు టాక్.
ఇక ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అయిన కొన్ని వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఇక ఇప్పటికే అంత ఫిక్స్ అయ్యింది కానీ ఇంకా ప్రకటన అయితే రాలేదు.మరి ఈ విషయంపై త్వరలోనే ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.
చరణ్ కు జంటగా పూజా హెగ్డే నటిస్తుంది.కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.