టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల తన పెళ్లి గురించి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.ఈ బ్యూటీ త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే వార్త గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతుండటంతో, కాజల్ ఎవరిని పెళ్లి చేసుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
దీంతో కాజల్ తన పెళ్లి గురించిన అఫీషియల్ ప్రకటన చేసింది.గౌతమ్ కిచ్లు అనే ముంబై బిజినెస్మ్యాన్ను కాజల్ పెళ్లాడబోతున్నట్లు తెలిపింది.
ఇక ఈ బ్యూటీ ఇప్పటికే పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను ఓకే చేసి ఉంది.అందులో ముఖ్యంగా టాలీవుడ్లో నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం కూడా ఉండటం విశేషం.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.అయితే ఈ సినిమా పూర్తి కమర్షియల్ మూవీ కావడంతో కాజల్ పెళ్లికి ముందు నటించే చివరి కమర్షియల్ సినిమాగా ఆచార్య నిలవనుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
పెళ్లి తరువాత కాజల్ కూడా మిగతా హీరోయిన్ల లాగా కేవలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
ఏదేమైనా మిగతా హీరోయిన్ల మాదిరిగా ఈ బ్యూటీ కూడా పెళ్లి తరువాత ఇలా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో నెట్టుకొస్తుందా అనేది చూడాలి.
ఒకవేళ ఇదే నిజమైతే కాజల్ చేసే చివరి కమర్షియల్ మూవీ ‘ఆచార్య’ అవుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది.ఈ సినిమాలో కాజల్ పాత్ర చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
కాగా గతంలో చిరు సరసన ‘ఖైదీ నెంబర్ 150’లో కాజల్ నటించిన సంగతి తెలిసిందే.ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో, చిరు ఇప్పుడు మరోసారి కాజల్ను రిపీట్ చేస్తున్నాడు.