మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే 40 శాతం షూటింగ్ జరుపుకున్న చిత్ర యూనిట్ ప్రకటించింది.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ‘ఆచార్య’ చిత్రంపై అతిభారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఇటీవల మెగాస్టార్ పుట్టినరోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి.పూర్తి సోషల్ డ్రామా చిత్రంగా ఈ సినిమా వస్తుండటంతో, ఇందులో చిరంజీవి ఎలా రఫ్ఫాడిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమా షూటింగ్ను లాక్డౌన్ కారణంగా వాయిదా వేశారు చిత్ర యూనిట్.అయితే లాక్డౌన్ నుండి సినిమా షూటింగ్లకు పర్మిషన్ దొరకడంతో ఇప్పుడు దాదాపు అన్ని సినిమాలు కూడా షూటింగ్లకు రెడీ అవుతున్నాయి.
కానీ ఆచార్య మాత్రం ఇప్పట్లో తిరిగి షూటింగ్ జరుపుకునేలా కనిపించడం లేదు.ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించేందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓకే అన్నాడట.కానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోన్న కాజల్ అగర్వాల్ ఇప్పట్లో సినిమా షూటింగ్స్లో పాల్గొననని తేల్చి చెప్పేసిందట.దీంతో ఆచార్య చిత్ర యూనిట్ అయోమయంలో పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
చిరంజీవి, కాజల్ మధ్య జరిగే సీన్స్కు సంబంధించిన షూటింగ్ను నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.కానీ వారికి షాకిస్తూ కాజల్ సినిమా షూటింగ్కు నో చెప్పడంతో చిరు అండ్ టీమ్ కన్ఫ్యూజన్లో పడ్డారట.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే చాలా ఆలస్యం అవుతుందని చిత్ర దర్శకుడు కొరటాల శివ నెత్తి పట్టుకుంటున్నాడు.ఇప్పుడు కాజల్ కొత్త మెలిక పెట్టడంతో ఆయన తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.
దీంతో ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన రామ్ చరణ్ కాజల్ను షూటింగ్కు రావాలని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి ఆచార్య ఆవేదనను చందమామ అర్ధం చేసుకుంటుందో లేదో చూడాలి.