మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్యపై అందరికి భారీ అంచనాలున్నాయి.అపజయమే ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న కారణంగా అంచనాలు మరింతగా పెరిగాయి.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిష అనుకుంటే ఆమె ఏదో వివాదం కారణంగా వెళ్లి పోయింది.ఇక ఈ చిత్రంలోని కీలక పాత్ర కోసం మహేష్బాబును సంప్రదించినట్లుగా ప్రచారం జరిగింది.
ఆ తర్వాత చరణ్ నటిస్తాడని అన్నారు.మళ్లీ మహేష్ బాబు అంటూ వార్తలు వచ్చాయి.
తాజాగా చిరంజీవి ఒక ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెళ్లడి చేశాడు.ఈ చిత్రం నుండి త్రిష తప్పుకోవడంకు విభేదాలు కారణం కాదని మణిరత్నం సినిమాలో ఛాన్స్ రావడం వల్ల ఆమె వెళ్లి పోయిందని అన్నాడు.ఇక ఈ చిత్రంలో చరణ్ నటించబోతున్నట్లుగ చిరంజీవి అనధికారికంగా చెప్పాడు.రాజమౌళిని ఒక నెల రోజుల పాటు చరణ్ ను షూటింగ్కు పంపించాలంటూ విజ్ఞప్తి చేశాం.
ఇక చరణ్ నేను తండ్రి కొడుకులుగా నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు.మా ఇద్దరి మద్య గురు శిష్యుల మాదిరి సంబంధం ఉంటుందని అన్నాడు.
మేమిద్దరం కలిసి నటించాలనేది సురేఖ కోరిక.ఆ కోరిక ఆచార్యతో తీరుతుందని నేను భావిస్తున్నాను.
ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉందని మెగాస్టార్ అభిప్రాయ పడ్డాడు.