మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మెగా ప్రభంజనం సృష్టించేందుకు చిరంజీవి రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఆచార్య చిత్ర మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఈ సినిమాను తొలుత సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడం అసాధ్యంగా మారిపోయంది.అయితే ఈ సినిమాను వేసవి కానుకగా 2021 ఏప్రిల్ 9న రిలీజ్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అసలే మెగాస్టార్ చిత్రం, అందులోనూ స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తుండటంతో సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి తొందరపాట్లు జరగకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త తీసుకుంటున్నారట.
అందుకే ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తే ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు.అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
కాగా నిరంజన్ రెడ్డితో కలిసి చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మరి ఈ సినిమా వేసవి కానుకగా రిలీజ్ అవుతుండటం ‘ఆచార్య’కు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.