టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించినటువంటి చిత్రం ఆచార్య.కొరటాల శివ దర్శకత్వంలో ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.ఇకపోతే ఈ సినిమా థియేటర్లో విడుదలైన మూడు వారాలకే అమేజాన్ ప్రైమ్ లో విడుదలైంది.
ఇలా థియేటర్లో భారీ పరాజయాన్ని ఎదుర్కొన్నటువంటి ఈ సినిమా కనీసం ఓటీటీలో అయినా మంచి విజయాన్ని అందుకుంటుందా అనే సందేహం అందరికీ కలిగింది.అయితే ఓటీటీలో కూడా ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయిందని చెప్పాలి.
ఇకపోతే థియేటర్లోనూ,ఓటీటీలోకూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే ప్రముఖ బుల్లితెర ఛానల్ జెమినీ టీవీలో ఈ సినిమా ప్రీమియర్ కానుందని తెలుస్తుంది.
ఇకపోతే రానున్న దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమాని ప్రసారం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.అయితే త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రానుంది.థియేటర్లోనూ, ఓటీటీలోనూ పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయినా ఈ సినిమా టెలివిజన్లో అయిన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా ఇక్కడైనా హిట్ టాక్ సొంతం చేసుకుంటుందా అనే సందేహం మెగా అభిమానులలో నెలకొంది.ఏది ఏమైనా చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించిన ఈ సినిమా అభిమానులకు చేదు ఫలితాన్ని ఇవ్వడంతో అభిమానులు ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు.