‘జగన్ పై నా తమ్ముడితో ఎవరో కావాలనే దాడి చేయించారు.ఎవరు చేయించారో చెబితే.
వాళ్లు నా తమ్ముడిని చంపేస్తామని బెదిరించి ఉంటారు.అందుకే వాడు చెప్పడం లేదేమో.
డబ్బులు ఇస్తామని ఆశపెట్టి ఈ పని చేయించి ఉంటారు.ఆ డబ్బుతో భూమి కొందామని అనుకొని ఉంటాడు.
అందుకే వాళ్లు చెప్పినట్లు చేశాడేమో’… ‘నా తమ్ముడి ఇంతటి దారుణానికి ఒడిగడతాడని మేము ఊహించలేదు.
ఈ పనికి పురమాయించిన వారు ఇప్పుడు వాడిని చంపేస్తారేమోననే భయం మా అందర్నీ వెంటాడుతోంది.ఎవరో చేయించిన పనికి నా తమ్ముడు ఇలా బలైపోయాడు.నేను కళ్లారా చూసే దానిని.
వాడు చిన్న ఫోన్ వాడే వాడు.మరి తొమ్మిది ఫోన్లు మార్చాడంటే నమ్మలేకపోతున్నాను.
అంటూ … వైసీపీ అధినేత జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ సోదరి రత్నకుమారి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు