జడ్జి కళ్ల ముందే ముద్దాయి హత్య.. ఎక్కడో తెలుసా?

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే.తాజాగా జరిగిన ఓ హత్య అక్కడ నెలకొన్న రాక్షస రాజ్యానికి నిదర్శనంగా నిలిచింది.

 Accused Murdered In Uttar Pradesh Court-TeluguStop.com

ఓ కేసులో ముద్దాయి అయిన వ్యక్తిని కోర్టులో విచారిస్తుండగా జడ్జి కళ్ల ముందే హత్య చేసిన సంఘటన తాజాగా చోటు చేసుకుంది.

బిజ్నూర్ జిల్లా కోర్టులో జరిగిన ఈ ఉదంతంలో హత్య కేసులో నిందితుడైన షానవాజ్ అన్సారీని జడ్జి విచారిస్తుండగా ముగ్గురు వ్యక్తులు అతడిని అతి కిరాతకంగా కాల్చి చంపారు.

ఈ దాడిలో కోర్టు ఉద్యోగి ఒకరు గాయపడ్డారు.జడ్జి, కోర్టు ఉద్యోగులు, న్యాయవాదులు చెక్క బల్లల కింద దాక్కుని తమ ప్రాణాలు కాపాడుకున్నారు.

కాగా కాల్పులు జరిపిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యాయస్థానంలో కూడా హత్యలు జరుగుతుండటంతో ఆ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొందో అర్ధం చేసుకోవచ్చు.

ఏదేమైనా ఈ ఘటనతో అక్కడి శాంతిభద్రతలపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube