జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డీజీ లోహియా హత్య కేసులో పురోగతి లభించింది.హత్యకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు 36 ఏళ్ల యాసిన్ అహ్మద్ గా గుర్తించారు.హత్య జరిగిన సంఘటన స్థలంలో నిందితుని డైరీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.
హత్యకు గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.తన జీవితంలో విషాదం తప్ప మరేమీ లేదని నిందితుడు రాసుకున్నట్లు గుర్తించారు.
అహ్మద్ డిప్రెషన్ లో ఉన్నాడని తెలిపారు.డిప్రెషన్ తో హత్యకు పాల్పడ్డడా లేక కుట్రపూరితంగానే హత్య చేశాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరోవైపు పీఏఎఫ్ఎఫ్ హత్యకు తనదే బాధ్యత అని, అమిత్ షాకు బహుమానంగానే హత్య చేసినట్టు ప్రకటించుకుంది.దీంతో నిందితుడికి, పీఏఎఫ్ఎఫ్ గల సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.