ఇటీవల కాలంలో వచ్చే కొన్ని వీడియోలు చూస్తే వీడియో తీసిన వారు అసలు మనుషులేనా.వారికి సహాయం చేసి ఉంటే బ్రతికేవారు కదా! అని మనకు అనిపిస్తుంది.
ఇలాంటి ఘటనల గురించి సినిమాల్లో కూడా చూపించిన సంగతి తెలిసిందే.ఇకపోతే తాజాగా మానవత్వం మరిచిన రిపోర్టర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సాధారణంగా అయితే ప్రాణం పోతుంటే జనాలు ఫోన్లలో వీడియోలు తీస్తూ మానవత్వం మరిచి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని టీవీ చానళ్ళు వేసిన విజువల్ నే మళ్లీ మళ్లీ వేసి జనాలపై కోపం తెప్పిస్తారు కానీ ఇప్పుడు టీవీ ఛానెల్ రిపోర్టర్లు ఆ ప్రమాద స్థలంలో ఉన్న అలానే ప్రవర్తిస్తారు అని అర్ధం అవుతుంది ఆ వీడేయో.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి పడిపోయి ఉన్నాడు.బాధితుడు ప్రాణాలు కాపాడాలని వేడుకున్నాడు.
కానీ జనం ఎవరు ముందుకు రాకుండా చూస్తూ ఉండిపోయారు.ఇంకా ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్, కెమేరా మ్యాన్ ఈ యాక్సిడెంట్ చూసి ప్రాణాలు కాపాడేవాడిలా పరిగెత్తుకుంటూ వచ్చాడు.
కానీ తీరా వచ్చాక బాధితుడు బాధను పట్టించుకోకుండా.ఎక్స్క్లూజివ్ విజువల్స్ దొరికాయనే ఆనందంతో బాధతో విలవిల్లాడుతున్న అతన్ని వారికీ కావలసిన యాంగిల్స్ లో వీడియోలు తీసుకొని వెళ్లిపోయారు.
రిపోర్టర్, కెమెరా మ్యాన్ చేసిన పని అంత అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది.అది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.