హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై ప్రమాదం.. ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.హైదరాబాద్ - శ్రీశైలం (Hyderabad ,Srisailam) ప్రధాన రహదారిపై చోటు చేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

ఆమనగల్ మండలంలో ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

కల్వకుర్తి (Kalvakurti)నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు హైదరాబాద్ నుంచి శ్రీశైలం నుంచి వెళ్తున్న బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి.వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..

తాజా వార్తలు