ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీల మధ్య సాగుతున్న పోరు ఇప్పటిది కాదు.ఒకరు కలం అంటే మరొకరు కత్తి అనేలా ఉంటాయి.
ఈ క్రమంలోనే ఎన్నో ఆరోపణలు, విమర్శలు కామన్ పాయింట్లా మారిపోయింది ఈ రెండు పార్టీల నేతలకు.ఈ క్రమంలోనే మరొక సారి వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో వైసీపీ ఓటు వేయకపోతే పథకాలు రావంటూ భయపెట్టే వాలంటీర్ల ఆగడాలను బయట పెట్టాలని, ఈ విషయంలో ఎవరైనా వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని తన పార్టీ శ్రేణులకు సూచించారు.
కాగా ఆ ఫిర్యాదులను కాల్ రికార్డు కానీ, ఫొటో రూపంలో గానీ 7557557744 నంబర్కు వాట్సాప్ చేయాలని ప్రకటించారు.ఈమేరకు ఎవరైతే ఇలాంటి దారుణాలను బయట పెడతారో వారి అకౌంట్ లోకి రూ.10 వేలు వేస్తామని చెప్పారు.
ఇకపోతే ఈ నిబంధన తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు వర్తిస్తుందని పేర్కొన్నారు.ఇక 10 పైసలు ఇచ్చి, 90 పైసలు దోచుకుంటున్న జగన్ కు బుద్ధి చెప్పాలంటే తిరుపతి ఉప ఎన్నికలో ఓటర్లంతా టీడీపీ పక్షాన నిలవాలని కోరారు.
ఈ సందర్భంగా కొందరు ఇదంతా ఎన్నికల స్టంట్ అని అనుకుంటున్నారట.