జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా అచ్చెన్నాయుడి అరెస్ట్ గురించి స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు.అవినీతికి పాల్పడినందుకా? లేక కక్ష సాధింపు కోసమా? ఆయనను అరెస్ట్ చేసింది అంటూ జగన్ సర్కార్ ను ప్రశ్నించారు.పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.అచ్చెన్నాయుడు అరెస్ట్పై ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు.
జనసేన అవినీతి ఏ రూపంలో ఉన్నా, బాధ్యులెవరైనా వ్యతిరేకిస్తుందని పవన్ మరోమారు స్పష్టం చేశారు.అసెంబ్లీ సమావేశాలకు కొన్ని రోజుల ముందు అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయడం సందేహాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసే సమయంలో నిబంధనలు పాటించాలని ప్రభుత్వానికి సూచించారు.ఈఎస్ఐ స్కామ్తో పాటు, అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు.