జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ శ్రావణి రాజీనామాకు ఆమోదం లభించింది.ఈ మేరకు వైస్ ఛైర్మన్ కు ఇంఛార్జ్ గా బాధ్యతలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై శ్రావణి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.పార్టీ కోసమే పని చేస్తామని పలుసార్లు వేడుకున్న కూడా వినకుండా కక్ష గట్టారన్నారు.
తన కుటుంబానికి ఎమ్మెల్యే వలన ప్రాణహాని ఉందని ఆరోపించారు.ఈ నేపథ్యంలోనే ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గత వారం ప్రకటించారు.
ఇవాళ శ్రావణి తన రాజీనామా లేఖను కలెక్టర్ కు సమర్పించగా.కలెక్టర్ రవి ఆమోదం తెలిపారు.