ఎంపీ రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కోర్టు.. ?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు నమోదు అయినప్పటి నుండి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.అయినా ఈ వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు.

 Acb Court Shocks Mp Revanth Reddy, Mp Revanth Reddy, Udayasimha, Sebastian, Cour-TeluguStop.com

రబ్బరు సాగుతున్నట్లు సాగుతూనే ఉంది.అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై ఏసీబీ కోర్టు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ లపై అభియోగాలు నమోదు చేసింది.

కాగా రేవంత్ రెడ్డి, ఇతరులపై ఐపీసీ 120 బి రెడ్ విత్ 34 కింద అభియోగం నమోదు చేశారని వెల్లడిస్తున్నారు.ఇదే కాకుండా ఓటుకు నోటు కేసు నిందితులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కింద కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపింది.

ఇక గతంలో ఏసీబీ ఓటుకు నోటు కేసు ఒక కుట్ర పూరితంగా జరిగిందని.గండిపేట తెలుగుదేశం మహానాడు వేదికగా ఈ కుట్ర జరిగిందని వెల్లడించిన విషయం తెలిసిందే.

Telugu Congress Mp, Shock, Ipc, Sebastian, Udayasinha-Latest News - Telugu

ఇక ఈ కేసు నమోదు అయినప్పటి నుండి, తమపై చేస్తున్న అభియోగాల్లో నిజం లేదని రేవంత్ రెడ్డి, ఉదయసింహా, సెబాస్టియన్ లు పేర్కొంటున్నారు.అయినా వీరి మాటలు పట్టించుకోని అధికారులు వారిపని వారు చేస్తూ వెళ్లుతున్నారు.ఇకపోతే ఈనెల 19న సాక్షుల విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube