భారతీయులు ఎక్కడ ఉన్నా ఫ్రంట్ పాకెట్ ,బ్యాక్ పాకెట్ లో అదృష్టాన్ని పెట్టుకుని తిరుగుతూనే ఉంటారు.ఇలాంటి అదృష్టమే అబుదాబిలో ముగ్గురు భారతీయ డ్రైవర్లను వరించింది.అబుదాబిలో ప్రతి నెలా నిర్వహించే మంత్లీ జాక్ పాట్ లక్కీ డ్రా లో భారత డ్రైవర్లు ముగ్గురికి ఏకంగా 20 మిలియన్ దిర్హమ్స్ వచ్చి జేబూలో పడ్డాయి.20 మిలియన్ దిర్హమ్స్ అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.41,61,07,638. కోట్లు.
నోళ్ళు వెళ్ళబెట్టారా.అవును మీరు విన్నది నిజమే అంత పెద్ద మొత్తంలో గెలుచుకున్న ఏకైక భారతీయులు కూడా ఈ ముగ్గురేనట ఇప్పటి వరకూ భారతీయులకి ఇంత పెద్ద మొత్తంలో లాటరీ తగలలేదని అంటున్నారు నిర్వాహకులు.
ఈ టిక్కెట్ కేరళా రాష్ట్రానికి చెందిన జిజేష్ అనే వ్యక్తిని వరించింది.అతడు చాలా ఏళ్ళుగా అబుదాబిలో కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.తన స్నేహితులు ఇద్దరితో కలిసి ఇలా లాటరీ టిక్కెట్టు కొంటున్నాడు.
ఈ లాటరీ టిక్కెట్టు డ్రా తీస్తున్న సమయంలో అతడు తన భార్యా, పిల్లలతో కలిసి అక్కడే ఉన్నాడు.
నిర్వాహకులు టిక్కెట్టు నెంబర్ : 041779 అనే టిక్కెట్టు తగిలిందని ప్రకరించాగానే అతడి ఆనందానికి అవధులు లేవు.ఒక్క సారిగా ఉబ్బితబ్బిబ్బైన అతడు వెంటనే ఈ విషయాని తన స్నేహితులతో పంచుకున్నాడు.
ఈ మొత్తాని తన స్నేహితులతో సమానంగా పంచుకుంటానని , తన కూతురు చదువుకోసం ఖర్చు చేస్తానని తెలిపాడు.
.