బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ మొత్తం కరోనా భారిన పడ్డ సంగతి తెలిసిందే.దీంతో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇంకా వీరు వారి ఆరోగ్యంపై తరచూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సమాచారాన్ని అందిస్తున్నారు.
అప్పుడప్పుడు కొన్ని వీడియోలు షేర్ చేస్తూ వారి అనుభవాన్ని కూడా ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మొన్న కొందరు నెటిజన్లు రెచ్చిపోయి అమితాబ్ బచ్చన్ ను కించపరుస్తూ కామెంట్లు చెయ్యడం, అమితాబ్ కరోనాతో చచ్చిపోతాడంటూ కామెంట్ చెయ్యడం వల్ల వారికీ తనదైన శైలిలో అదే స్థాయిలో సమాధానం ఇచ్చాడు.
ఇది అంత ఇలా ఉంటే.ఐసోలేషన్ వార్డులో అభిషేక్ బచ్చన్ ఒంటరిగా ఉంటున్నాడు.గదిలో నుండి అతను బయటకు రాకుండా గదిలోనే యోగ, మెడిటేషన్ చేస్తూ కాలం గడుపుతున్నాడు.
ఇక అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రి పరిసరాలు పూర్తి నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా మారిపోతున్నాయంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తెలిపారు.అభిషేక్ బచ్చన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేస్తూ.”లైట్లు వెలుగుతున్న ఓ పెద్ద టన్నెల్”లా ఉందని లేట్ నైట్ వాక్ అంటూ హ్యాష్ ట్యాగ్ షేర్ చేశారు.నిజానికి ఆ ఫోటో కాస్త భయంకరంగానే ఉంది.