టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్.త్వరలోనే వెండితెరలో హీరోగా పరిచయం కానున్నాడు.
కానీ ఈయన హీరో కంటే ముందే ప్రేక్షకులకు పరిచయం ఉన్న వ్యక్తిగా మారాడు.గతంలో శ్రీ రెడ్డి పై ఈయనకున్న సంబంధం గురించి శ్రీ రెడ్డి బయట పెట్టగా.
ఈ విషయం అప్పట్లో బాగా వైరల్ గా మారింది.అప్పటినుండి ఈ కుటుంబంను బాగా బయటకు లాగడం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా అభిరామ్ శ్రీ రెడ్డి ఇష్యూపై కొన్ని విషయాలు పంచుకున్నాడు.
మే 9న అభిరామ్ బర్త్ డే సందర్భంగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
తన జీవితంలో జరిగిన బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ గురించి మనసులో మాటలు చెప్పేశాడు.తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు.అంతేకాకుండా ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తిని కాకుండా ఫ్యామిలీ మొత్తాన్ని బయటకు లాగడం కరెక్ట్ కాదని తెలిపాడు.ఇక తను నార్మల్ హీరోగా మాత్రమే ఉండాలనుకుంటున్నాడట.
దగ్గుబాటి రామానాయుడు మనవడుగా, సురేష్ బాబు కొడుకు గా ఉండే ఇంపార్టెంట్ తనకు వద్దని తెలిపాడు.తనకు మంచి లవ్ స్టోరీ చేయాలని ఉందని.అందులో మంచి కంటెంట్ ఉన్న మెసేజ్ ఉండాలని తెలపగా.తాను చేయబోయే సినిమాలో కంటెంట్ వుందని.
త్వరలోనే అందరు చూస్తారని, ఈ సినిమాలో తన గతాన్ని రివిల్ చేసినట్టు అనిపిస్తుంది అని తెలిపాడు.అంతే కాకుండా తన మొదటి సినిమా లో తన లైఫ్ ఇన్సిడెంట్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయని.
ఈ సినిమా ద్వారా తన జీవితాన్ని మార్చుకోవచ్చని అనుకుంటున్నాడట.
తనకు జరిగిన బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ వల్ల ఈ జనరేషన్ కి తను చెప్పేది ఒకటి ఉందంటూ.దూకుడు వద్దని, అలా చేయడం వల్ల వేరే ఫ్యామిలీకి ఎఫెక్ట్ కాకూడదని, ఫ్యామిలీకి చెడ్డపేరు రావడంతోపాటు వాళ్ళ పేరు పోతుందని తెలిపాడు.తాను చేసిన ఒక తప్పు వల్ల తన ఫ్యామిలీ పేరు బయటపడిందని తెలిపాడు.
ఫలానా వాళ్ళ కొడుకు, తమ్ముడు అని ఎందుకు చేస్తారు.ఒక యాక్సిడెంట్ చేస్తే అది చేసిన వారి మిస్టేక్ కదా అంటూ తను చేసే తన పేరు మాత్రమే రావాలి కానీ ఫ్యామిలీ పేరు రాకూడదని అన్నాడు.
ఇక తన లైఫ్ లో జరిగిన బ్లాక్ మెయిల్ అనేది అందరి లైఫ్ లోనూ ఉంటుంది.కొంతమంది బయటపడతారు.కొంతమంది బయటపడరు అంటూ.ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండాలని.
కోవిడ్ కు ఎలా భయపడుతున్నామో.ఎదుటి వాళ్ల విషయంలో అంతే జాగ్రత్తగా ఉండాలంటూ.
నమ్మకం లేని చోట ఇంకా జాగ్రత్తగా ఉండాలంటూ తన మనసులోని మాటలు బయటకు చెప్పుకున్నాడు అభిరామ్.