బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ప్రస్తుతం నాల్గువ వారంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి దర్శకుడు సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి ఎలిమినేట్ కాగా.
కుమార్ సాయి, జబర్దస్త్ అవినాష్ మరియు స్వాతి దీక్షిత్ వైరల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.అయితే స్వాతి దీక్షిత్ హౌస్లోకి రాగానే.
పులిహోర రాజాగా పేరు తెచ్చుకున్న అభిజిత్ ఆమెతో ఏ రేంజ్లో పులిహోర కలిపాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అప్పటి వరకు కుదిరితే మోనాల్.
కుదరకపోతే హారిక అన్నట్టుగా వ్యవహరించాడు అభిజిత్.కానీ, స్వాతి దీక్షిత్ వచ్చి.
హారిక, మోనాల్కు గట్టి పోటీ ఇస్తోందని చెప్పాలి.స్వాతి దీక్షిత్ వచ్చిన మొదటి రోజే అభిజిత్తో అర్థరాత్రి ముచ్చట్లు పెట్టి హాట్ టాపిక్గా మారింది.
అయితే నిన్న జరిగిన ఎపిసోడ్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఉదయం లేవగానే ‘గొంగూర తోట కాడా కాపు కాసా’ మాస్ సాంగ్కు ఇంట్లోని సభ్యులంతా ఫుల్ ఎనర్జిటిక్గా చిందులేశారు.అనంతరం మార్నింగ్ మస్తీలో భాగంగా. స్వాతి దీక్షిత్ ఇంటి సభ్యులకు నవరసాలు నేర్పించాలని బిగ్ బాస్ ఆదేశించాడు.
నవరసాల్లో భాగంగా మొదట శృంగార రసాన్ని ఎంచుకుంది స్వాతి.ఈ క్రమంలోనే తన పార్ట్నర్గా అభిజిత్ను ఎంపిక చేసుకుని.
శృంగార రసంలో లవ్ చేస్తున్నట్లు యాక్ట్ చేస్తూ ఓ రేంజ్లో రెచ్చిపోయింది.ఇక వారిద్దరి మధ్య రొమాన్స్ బాగానే పడింది.
అయితే అభిజిత్, స్వాతి దీక్షిత్ రొమాన్స్పై హౌజ్లోని సభ్యులే కాదు బిగ్ బాస్ ప్రియులు సైతం రకరకాల కామెంట్లు చేస్తున్నారు.కొత్తగా వచ్చిన ఈమెను కూడా వదలట్లేదని.
పులిహోర కలపడంలో అభిజిత్ పీహెచ్డీ చేసి ఉంటాడని సెటైర్లు వేస్తున్నారు.మరోవైపు అభిజిత్, స్వాతిని చూసి హారిక, మోనాల్ తెగ ఫీల్ అవుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఏదేమైనా స్వాతి దీక్షిత్ రాకతో.మోనాల్, హారికలు అభిజిత్కు దూరం అవుతున్నారు.