ప్రస్తుతం బుల్లితెరపై కొన్ని జంటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఇందులో ముఖ్యంగా సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి ముందంజలో ఉంటారు.
వీరిద్దరూ కలిసి జబర్దస్త్ కామెడీ షో తోపాటు డీ షో లో కూడా బాగా నిలుస్తున్నారు.ఓ షో లో భాగంగా ఒక ఈవెంట్ లో సుధీర్ రష్మీ పెళ్లి చేసుకున్నట్లు చూపించిన కూడా, సుధీర్ బయట మాత్రం రష్మీ మీద తనకి ఎలాంటి ప్రేమ లేదని ఇద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్ అంటూ అనేకసార్లు చెప్పుకొచ్చాడు.
ఇక వీరిద్దరి తర్వాత ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నప్పటికీ.బుల్లి తెర పై వారి కెమిస్ట్రీ ని కొనసాగిస్తున్న జంట హైపర్ ఆది, వర్షిణి.వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ నడుస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నప్పటికీ , హైపర్ అది మాత్రం వర్షిణి ట్రాక్ లో పడేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.వర్షిణి మొదటి నుంచి మోడలింగ్ రంగం నుంచి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటించి మంచి పేరును సొంతం చేసుకుంది.
అనంతరం యాంకరింగ్ చేస్తూ స్థిరపడి, పెళ్లిగోల 2 వెబ్ సిరీస్ లో నటించిన తర్వాత తనకంటూ మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.అంతేకాకుండా ప్రస్తుతం హైపర్ ఆది, వర్షిణి ఇద్దరు కలిసి చేస్తున్న ఢీ షో లో ఎప్పటికప్పుడు వారిద్దరి మధ్య కెమిస్ట్రీని పండిస్తూ మంచి మార్కులు కొట్టేస్తున్నారు.
వర్షిణి విషయంలో హైపర్ ఆది కూడా తనకు వీలైనప్పుడల్లా వర్షిణి మీద ప్రేమను వ్యక్తం చేస్తున్నట్లు ఇటీవల కాలంలోనే ఆమె కోసం ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినట్లుగా కూడా మనం వార్తల్లో చూశాం.అయితే ఇటీవల కాలంలో వర్షిణి మాత్రం ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షో లో తనకు ప్రేమ పట్ల ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని హైపర్ ఆది ముందే తెలియజేసింది.అయినప్పటికీ కూడా హైపర్ ఆది మాత్రం ఆ విషయాలు పట్టించుకోకుండా సిన్సియర్ గానే ట్రై చేస్తున్నట్లు సమాచారం.తాజాగా వర్షిణి బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ తో కలిసి తిరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక వర్షిణి విషయంలో అభిజిత్ కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తుండడం, అంతేకాకుండా వీరిద్దరూ కలిసి పెళ్లిగోల 2 సీజన్ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అప్పటి నుంచి వీరిద్దరి మధ్య అనుబంధం కొనసాగుతుంది.
ఇదిలా ఉండగా తాజాగా వర్షిణి విషయంలో సైడ్ తీసుకోమని అభిజిత్, హైపర్ ఆదికి ఫుల్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.