తెలుగు ప్రముఖ ఛానల్ అయినటువంటి ఈటీవీ లో ప్రతి శుక్రవారం ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ కామెడీ కార్యక్రమంలో తన స్కిట్లతో, మంచి టైమింగ్ పంచులతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే అదిరే అభి గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే అదిరే అభి జబర్దస్త్ కామెడీ షోలో నటించక ముందు నుంచే తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నప్పటికీ ఆయన నటించినటువంటి చిత్రాల్లో అభి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ అభి ని గుర్తించలేదు.
కానీ జబర్దస్త్ తో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే తాజాగా అదిరే అభి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఇందులో భాగంగా పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.అయితే తాను సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం చాల కాలం పాటూ ఎదురు చూశానని, అంతే గాక చిన్న, పెద్ద ఏదైనా సరే ఒక్క చాన్స్ ఇవ్వండంటూ చాలా మంది దర్శకనిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగానని చెప్పుకొచ్చాడు.
అయితే ఇటీవలే తాను “పాయింట్ బ్లాంక్” అనే చిత్రంలో హీరోగా నటించానని తెలిపాడు.ఈ చిత్రానికి బివిఎస్జి దర్శకత్వం వహిస్తుండగా ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై నిర్మాత కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మించారని తెలిపాడు.
ఈ చిత్ర టైటిల్ కి తగ్గట్టుగానే ఈ చిత్రం యాక్షన్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుందని. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.ఇక తన పాత్ర విషయానికొస్తే ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాని తెలిపాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి చిత్రీకరణ పనులు పూర్తి అయ్యాయని కానీ విడుదల చేసే సమయంలో కరోనా వైరస్ కలకలం సృష్టించిందని చెప్పుకొచ్చాడు.