షాక్ అవుతున్నారు కదా! నిజంగానే పావురం ప్రాణం తీసింది.అయితే పావురమే ప్రాణం తియ్యలేదు.
పావురం కారణంగా ప్రాణాలు కోల్పోయారు.ఇంకా ఈ దారుణమైన వింత ఘటన కృష్ణ జిల్లాలో చోటుచేసుకుంది.
పావురం కోసం గొడవపడి భర్త దారుణ హత్యకు గురి కాగా కోన ఊపిరితో భార్య కొట్టమిట్టాడుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
కృష్ణా జిల్లాలోని పెడన మండలం కట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.కట్లపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ ఇర్ఫాన్ ఐస్ బండి వ్యాపారం చేస్తున్నాడు.
వ్యాపారం ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన ఇర్ఫాన్ పావురం విషయంపై అదే గ్రామానికి చెందిన పాలపర్తి ప్రభాకర్రావుతో గొడవపడ్డాడు.
దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
అప్పటికే మద్యం సేవించిన ప్రభాకర్రావు అక్కడే ఉన్న చాకుతో ఇర్ఫాన్ను దారుణంగా పొడిచాడు.విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఇర్ఫాన్ అక్కడికక్కడే మృతిచెందాడు.
అయితే ఇంకా అది అడ్డుకోబోయిన ఇర్ఫాన్ భార్య కాజాపై కూడా దారుణంగా దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం పంపారు.
హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు.